Aamugguru Athmahatyalu kalakalam ఇంతకీ ఎం జరిగింది ఎందుకు అంతలా జీవితాన్ని ముగించే నిర్ణయం తీసుకున్నారు ఏమో గాని నిజాలు ఆ దేవుడికి వాళ్ళకే తెలియాలి ఏది ఏమైనప్పటికి మనుషులకే బాధలు వస్తాయి ఆ బాధల్ని దిగమింగి బతకొచ్చు పుట్టాక ఎప్పుడు ఒకేసారి పోతాం కానీ ఇలా అంటే ఎవరికైనా చూసినవాళ్ళకిన విన్నవాళ్ళకైనా బాధగా అనిపిస్తుంది మార్ఐ ఆవిడ కష్టం ఆమెకే తెలుసు..
చిన్న కనువిప్పు కొటేషన్ కింద చూడండి….
- Flip Book Code is Here You Find in Telugu
- Direct Interview in DRDO Jobs in Hyderabad
- Bhasinga Basinga Balalu Full Song 2026 Lyrics
- Laksharupayala bahumathi Miku Kavalante
- Happy Mothers day Quotes in Telugu
నిన్న రాత్రి ఘట్కేసర్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నప్పుడు, ఎవరో వ్యక్తి ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నారని స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారంతో చెప్పిన స్థలానికి చేరుకున్నాను. అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ వదలకుండా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్ వెంట వెతుకుతూ వెళ్లాను.
చివరికి చర్లపల్లి సమీపంలో ట్రాక్ మధ్యలో మూడు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట
సమయం… మనుషులెవరూ లేని ఆ చోట అప్పటికే శవాల చుట్టూ కుక్కలు చేరాయి. వెంటనే ఆ కుక్కలను వెళ్లగొట్టి, చలిలో తెల్లవార్లూ ఆ మృతదేహాలకు కాపలాగా నిలబడ్డాను. ఆ క్షణాలు, ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ల ముందే కదలాడుతున్నాయి.
Love proposals in telugu 2026 Gents life reality
తర్వాత విచారణలో తెలిసిన నిజాలు ఇంకా కలిచివేస్తున్నాయి.. మృతి చెందిన మహిళ పేరు పెన్నేటి విజయ(38). భర్త సురేందర్ రెడ్డి సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిది భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామం, ప్రస్తుతం బోడుప్పల్లో నివసిస్తున్నారు. హాస్టల్లో చదువుకుంటున్న తన ఇద్దరు పిల్లలను (పాప, బాబు) తీసుకువచ్చి, కారును చర్లపల్లి స్టేషన్లో పార్క్ చేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. 15, 16 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లితో కలిసి ప్రాణాలు వదలడం అనేది ఆ పిల్లలను తనతో పాటు ఆత్మహత్యకు ఆతల్లి ఎలా ఒప్పించిందో, వారి బంధం, అసలు అంతటి కష్టానికి గురి చేసిన సమస్య ఏంటో… ఎంతటి విషాదం! ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం
ఏదేమైనా వాళ్ళ ఆత్మకు శాంతి చేజారగాలని కోరుకుందాం …
ఇంకోటి తృప్తి అనే దాన్ని పాటించండి కొంత మేరకు సంతోషంతో సంతృప్తి తో బతకొచ్చు…


