Sindoor Operation ane peru Enduku pettaru ఆపరేషన్ సి దూర్
కవ్వింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నాం దాడులు చేస్తున్నా సహించాం కానీ, కళ్లెదుటే కట్టుకున్న వాళ్లను కాల్చేసి దిక్కున్న చోట చెప్పుకోమంటే ఏడుస్తూ ఎలా ఊరుకుంటాం? నేల రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది. అయిదోతనం తుడిచేస్తే నుదుటిన చెరిగిన ఆ సిందూరం విస్పోటనమైంది. రక్కసి మూకలు నక్కి ఉన్న చోటును మృత్యుమేఘమై కమ్మేసింది. త్రివిద దళాల సాక్షిగా మిస్సెళ్ల రూపంలో దూసుకెళ్లి ఉగ్రమూకలను మట్టుబెట్టింది. వారి నెత్తురు చూశాకే దానిలోని వేడి చల్లారింది. ఇది ఇక్కడితో ముగిసిపోదని గట్టి హెచ్చరిక పంపింది. అమాయకులను చంపడం కాదు.. బాధ్యులను ఏరిపారేయడమే లక్ష్యమని భారత్ దెబ్బ రుచి చూపించింది.
Sindoor Operation ane peru Enduku pettaru
ఆపరేషన్ సింధూర్’.. ఈ పేరెందుకు పెట్టారంటే? POK, పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు
దాడులు చేసింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. అయితే, ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరెందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ వైరలవుతోంది. పహల్గామ్ భార్యల కళ్ల ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదుటిన సింధూరాన్ని తుడిచేశారు. దానికి ప్రతీకారమే ఈ దాడి అన్న అర్థంలో ‘సింధూర్’ అని పేరు పెట్టినట్లు